
మెదక్ టౌన్, వెలుగు: ఆశావర్కర్లకు రూ.18 వేల వేతనం చెల్లించాలని డిమాండ్చేస్తూ మెదక్ కలెక్టరేట్ఎదుట సీఐటీయూ యూనియన్ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సంఘం జిల్లా గౌరవ ప్రెసిడెంట్నర్సమ్మ మాట్లాడుతూ.. ఆశ వర్కర్లకుకు బడ్జెట్లో తగిన నిధులు కేటాయించాలని, ఉన్నతాధికారుల వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు.
కలెక్టరేట్లోని వెళ్లకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో గేటు బయటే రెండు గంటల పాటు ధర్నా చేశారు. అడిషనల్కలెక్టర్నగేశ్ కు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆశావర్కర్లు అందజేశారు. సంఘం జిల్లా నాయకురాలు రాణి, పెంటమ్మ, దుర్గ, గీత, లక్ష్మి, ప్రభావతి, సుశీల, సీఐటీయూ జిల్లా నేత సంతోష్ పాల్గొన్నారు.